Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రారంభానికి ఎదురుచూపులు.. మర్రిగూడ ఫ్లైఓవర్‌పై బీఆర్ఎస్ బైఠాయింపు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 18, 2026 02:27 PM

ప్రారంభానికి ఎదురుచూపులు.. మర్రిగూడ ఫ్లైఓవర్‌పై బీఆర్ఎస్ బైఠాయింపు.

ప్రారంభానికి ఎదురుచూపులు.. మర్రిగూడ ఫ్లైఓవర్‌పై బీఆర్ఎస్ బైఠాయింపు.

ప్రారంభానికి ఎదురుచూపులు.. మర్రిగూడ ఫ్లైఓవర్‌పై బీఆర్ఎస్ బైఠాయింపు.
July 18, 2026 12:59 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మాణ పనులు పూర్తయిన ఫ్లైఓవర్‌ను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఫ్లైఓవర్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రాజకీయ కారణాలతో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.

పనులు పూర్తయినప్పటికీ ప్రారంభం చేయకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే ఫ్లైఓవర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన నేపథ్యంలో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News