నీట్–2026లో ఎస్ఆర్ జైత్రయాత్ర..! ఆలిండియా 9వ ర్యాంకు... 16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు
నీట్–2026లో ఎస్ఆర్ జైత్రయాత్ర..! ఆలిండియా 9వ ర్యాంకు... 16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకుతో మెరిసిన వీరయ్య సహ్యూ
నల్గొండ రామగిరి బ్రాంచ్లో 16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు
దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన నీట్–2026 ఫలితాల్లో నల్గొండకు చెందినఎస్ఆర్ విద్యాసంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. ఆ సంస్థ విద్యార్థి వీరయ్య సహ్యూ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో9వ ర్యాంకు సాధించి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. 720 మార్కులకు గాను 705 మార్కులుసాధించి ఈ అరుదైన ఘనతను అందుకున్నట్లు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వర దారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం మంచి ఫలితాలే కాకుండా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ద్వారా ఎస్ఆర్ విద్యాసంస్థలు విద్యారంగంలో తమ ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారమే ఈ విజయాలకు కారణమని అన్నారు.
అదేవిధంగా నల్గొండ పట్టణంలోని రామగిరి బ్రాంచ్ ఎస్ఆర్ కాలేజీలో నీట్ లాంగ్టర్మ్ కోర్సు అభ్యసించిన 16 మంది విద్యార్థుల్లో 12 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించే ర్యాంకులు పొందడం విశేషమన్నారు. ఈ ఫలితాలు విద్యాసంస్థలో అందిస్తున్న నాణ్యమైన శిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను నల్గొండ ఎస్ఆర్ కాలేజీ జోనల్ ఇన్చార్జి దోనల శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపక బృందంతో కలిసి అభినందించారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి వారి విజయాలను కొనియాడారు.
ఈ సందర్భంగా దోనల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అంకితభావం, పట్టుదల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి ప్రత్యేక అధ్యయన ప్రణాళికలు అమలు చేయడం వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
విద్యార్థులు కూడా తమ విజయానికి అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధాన కారణమని పేర్కొన్నారు. నిరంతర సాధన, మాక్ టెస్టులు, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో చదవడం వల్లే మంచి ర్యాంకులు సాధించగలిగామని చెప్పారు.
నీట్–2026లో సాధించిన ఈ విజయాలతో ఎస్ఆర్ విద్యాసంస్థలు మరోసారి నల్గొండ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా తమ శిక్షణ కొనసాగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలిండియా 9వ ర్యాంకు సాధించిన వీరయ్య సహ్యూతో పాటు ఎంబీబీఎస్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు, సహ విద్యార్థులు ఘనంగా అభినందించి, వారి ఉన్నత విద్యాభ్యాసంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి