Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండకు వెంటనే పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్‌ను నియమించాలి: CM రేవంత్ రెడ్డికి BJP OBC మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ బహిరంగ లేఖ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 09:18 PM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలి: BRSV శ్రేణులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలి: BRSV శ్రేణులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలి: BRSV శ్రేణులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున
July 17, 2026 08:27 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సామాజిక, సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో మొక్కల నాటే కార్యక్రమం, అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారని నాగార్జున పేర్కొన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు ఐటీ టవర్ నిర్మాణం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జిల్లా అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న చర్యలు ప్రజలకు చిరస్మరణీయమని అన్నారు.

జన్మదిన వేడుకలను ఆర్భాటంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలని బీఆర్ఎస్‌వీ నిర్ణయించిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల నాటడం, అవసరమైన వారికి అన్నదానం చేయడం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ విలేకరుల సమావేశంలో జిల్లా బీఆర్ఎస్‌వీ నాయకులు మైనం యుగంధర్, నోముల క్రాంతి యాదవ్, కారింగు శ్రీకాంత్ గౌడ్, కన్నెబోయిన వంశీ, గణేష్, రాజు, రాంబాబు, మల్లేష్, సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని వారు ఈ సందర్భంగా నిర్ణయించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News