Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న కేంద్ర ఆర్థిక విధానాలు దొడ్డి దారిన మూడు నల్ల చట్టాలను మళ్లీ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 08:26 PM

బండ రామారం జెడ్ పి హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ సస్పెండ్

బండ రామారం జెడ్ పి హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ సస్పెండ్

బండ రామారం జెడ్ పి హెచ్ ఎస్ హెడ్ మాస్టర్ సస్పెండ్
July 17, 2026 07:05 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలంలోని బండరామారం జడ్పీహెచ్‌ఎస్(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)లో చోటుచేసుకున్న ఘటన జిల్లా విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.పాఠశాలలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మధ్య విభేదాలు చివరకు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించారు. పాఠశాలలో హెడ్‌మాస్టర్ హకీమ్‌తో పాటు కొందరు ఉపాధ్యాయుల మధ్య కొంతకాలంగా పరిపాలన, విధుల నిర్వహణకు సంబంధించిన విభేదాలు కొనసాగుతున్నాయి.

ఈ అంతర్గత వివాదాలు పాఠశాల విద్యా వాతావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, విద్యార్థుల చదువుల పై కూడా ప్రతికూల ప్రభావం చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్‌మాస్టర్ హకీమ్ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) జారీ చేసినట్లు సమాచారం..ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదాన్ని విద్యార్థులపై చూపించడం ఏమిటని తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా హెడ్‌మాస్టర్ వ్యవహరించారని వారు విమర్శిస్తున్నారు. విషయం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) అశోక్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో హెడ్‌మాస్టర్ చర్యలు విధి విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన డీఈఓ అశోక్, హెడ్‌మాస్టర్ హకీమ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


అంతేకాకుండా, పాఠశాలలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహించాల్సిన నలుగురు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం, విద్యా బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఈఓ స్పష్టం చేసినట్లు తెలిసింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న ఇలాంటి నిర్ణయాలు పునరావృతం కాకుండా విద్యా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నారూ. బండరామారం జడ్పీహెచ్‌ఎస్‌లో సాధారణ విద్యా బోధనను త్వరితగతిన పునరుద్ధరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News