వర్షాకాల వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కమిషనర్ ప్రశాంతి
వర్షాకాల వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కమిషనర్ ప్రశాంతి
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఫ్రైడే–డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 1వ వార్డులో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, కూలర్లు, డ్రమ్లు, పాత టైర్లు, కుండీలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా తరచూ శుభ్రం చేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి వర్షాకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పాటిస్తూ పరిశుభ్రమైన పరిసరాల కోసం సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి