సాయిబాబాపై అసత్య ప్రచారాలు ఆపాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ఓయూ విద్యార్థి నాయకులు
సాయిబాబాపై అసత్య ప్రచారాలు ఆపాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ఓయూ విద్యార్థి నాయకులు
Editor Desk
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం–సిద్ధగురు రమణానంద మహర్షి ఆశ్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, షిరిడి సాయిబాబాపై కొందరు చేస్తున్న విమర్శలు, అసత్య ప్రచారాలు కోట్లాది మంది సాయి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సిద్ధగురు రమణానంద మహర్షి సాయిబాబా పక్షాన నిలబడి "శత ప్రశ్న శరసంధానం" గ్రంథం ద్వారా సాయి వ్యతిరేక ప్రచారాలకు సమాధానం ఇచ్చారని కొనియాడారు. సాయి భక్తులైన తాము కూడా మహర్షికి అండగా నిలిచి సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో సామూహికంగా మహాపీఠాన్ని సందర్శించి తమ మద్దతును ప్రకటిస్తామని వెల్లడించారు.
సాయిబాబాపై అసత్య ప్రచారాలు, విమర్శలు కొనసాగితే రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాయి భక్తులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఓయూ విద్యార్థి నాయకులు ఆవుల మల్లేశం, వేముల కొండల్ గౌడ్, మామిడాల రవికుమార్, వెంకటేష్ గౌడ్, నరిమెట్ట గురు, పాలకుర్ల జానయ్య గౌడ్, ధీరజ్, శంకర్, ఎస్. నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి