ఫీజు బకాయిలు విడుదల చేయాలి: విద్యార్థుల మహాధర్నా.
ఫీజు బకాయిలు విడుదల చేయాలి: విద్యార్థుల మహాధర్నా.
Editor Desk
రామన్నపేట,
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేటలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. సుభాష్ సెంటర్లో రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు జీవో నెం.9, ఆర్ఆర్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేవైఎం నాయకులు అక్కెనపల్లి సైదులు, బీజేపీ కార్యవర్గ సభ్యుడు పల్లపు దుర్గయ్య, టీఎస్ఎస్ఏ నాయకుడు ఊరెళ్ల మహేష్, బీసీ సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం, జినుకల కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు సురేష్, మనీష్, అనిత, లింగస్వామి, వినయ్, వెంకట్, భాస్కర్, రమాదేవి, ఉషశ్రీ, ఉదయశ్రీ, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి