Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

పుల్కుర్తి కేజీబీవీ హాస్టల్‌పై డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

పుల్కుర్తి కేజీబీవీ హాస్టల్‌పై డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

పుల్కుర్తి కేజీబీవీ హాస్టల్‌పై డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
15-07-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని పుల్కుర్తి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌ను డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత, భద్రత, వైద్య సేవలను పరిశీలించి, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని, నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. హాస్టల్ నిర్వహణలో లోపాలకు తావులేకుండా విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ తనిఖీలో తహసీల్దార్ విష్ణు సాగర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్,ఎంపీడీఓ, హాస్టల్ ప్రిన్సిపాల్,పంచాయతీ కార్యదర్శి,సర్పంచ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



Sthanikam

పుల్కుర్తి కేజీబీవీ హాస్టల్‌పై డిప్యూటీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థినుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని పుల్కుర్తి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌ను డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత, భద్రత, వైద్య సేవలను పరిశీలించి, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని, నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. హాస్టల్ నిర్వహణలో లోపాలకు తావులేకుండా విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ తనిఖీలో తహసీల్దార్ విష్ణు సాగర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్,ఎంపీడీఓ, హాస్టల్ ప్రిన్సిపాల్,పంచాయతీ కార్యదర్శి,సర్పంచ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News