PRINT TIME: July 08, 2026 08:32 PM
శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం
శ్రీబాల నరసింహస్వామి ఆలయంలో చోరీ కలకలం
July 08, 2026 06:49 PM
111 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
హుండీ పగులగొట్టి నగదు అపహరణ.. భక్తుల్లో ఆందోళన
చిట్యాల, జూలై 8: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించినట్లు గుర్తించారు.
బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి హుండీ ధ్వంసమైన విషయాన్ని గమనించి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయంలో చోరీ జరగడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఆలయాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి