Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:03 AM

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం
08-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ సతీష్ గోపాటి గారిని కొమ్మాయిగూడెం గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎస్‌ఐని కోరారు. పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ఎస్‌ఐ సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా స్పందించి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కూనూరు కృష్ణ గౌడ్, సీపీఐ నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేష్ గౌడ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బత్తుల సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఎస్‌ఐ సతీష్ గోపాటికి ఘన స్వాగతం

Article Image

: రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ సతీష్ గోపాటి గారిని కొమ్మాయిగూడెం గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఎస్‌ఐని కోరారు. పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ఎస్‌ఐ సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా స్పందించి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కూనూరు కృష్ణ గౌడ్, సీపీఐ నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేష్ గౌడ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బత్తుల సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News