ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి
K.RAVI
మున్సిపల్ చైర్మన్కు ఎస్ఎఫ్ఐ వినతిపత్రం
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ కి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోని తాగునీటి ప్లాంటును వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాగునీటితో పాటు కళాశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పోలేపల్లి మల్లేష్, జూనియర్ కళాశాల కార్యదర్శి సిద్దు, నాయకులు యశ్వంత్, వంశీ, సాయి, మంజునాథ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి