Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..! నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 09:42 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి
July 08, 2026 08:09 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్మన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతిపత్రం

​స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ కి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోని తాగునీటి ప్లాంటును వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాగునీటితో పాటు కళాశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలి అన్నారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు పోలేపల్లి మల్లేష్, జూనియర్ కళాశాల కార్యదర్శి సిద్దు, నాయకులు యశ్వంత్, వంశీ, సాయి, మంజునాథ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News