Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:28 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి
08-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్మన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతిపత్రం

​స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ కి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోని తాగునీటి ప్లాంటును వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాగునీటితో పాటు కళాశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలి అన్నారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు పోలేపల్లి మల్లేష్, జూనియర్ కళాశాల కార్యదర్శి సిద్దు, నాయకులు యశ్వంత్, వంశీ, సాయి, మంజునాథ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

Article Image

మున్సిపల్ చైర్మన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతిపత్రం

​స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ కి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోని తాగునీటి ప్లాంటును వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాగునీటితో పాటు కళాశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలి అన్నారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు పోలేపల్లి మల్లేష్, జూనియర్ కళాశాల కార్యదర్శి సిద్దు, నాయకులు యశ్వంత్, వంశీ, సాయి, మంజునాథ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News