Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మెండే నరసింహకు చిరుమర్తి నివాళి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 07:42 PM

గొట్టిపర్తి లో రికార్డు స్థాయిలో 103 అడ్మిషన్లు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అద్భుత విజయం...పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీహరి

గొట్టిపర్తి లో రికార్డు స్థాయిలో 103 అడ్మిషన్లు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అద్భుత విజయం...పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీహరి

గొట్టిపర్తి లో రికార్డు స్థాయిలో 103 అడ్మిషన్లు  ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ అద్భుత విజయం...పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీహరి
July 08, 2026 06:25 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం విశేషణ స్పందన రావడంతో ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు బుధవారం నాడు వినూత్న కార్యక్రమం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. పాఠశాలలో గత ఏడాది మొత్తం విద్యార్థులు 79 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం 10వ తరగతిలో 16 మంది ఉత్తీర్ణులై ఉన్నత విద్యలో ప్రవేశించారు. ఈ ఏడాది వేసవి కాలంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి

ఎరటుఎండలో లెక్కచేయకుండా ఉపాధ్యాయులు బృందం గ్రామంలో ప్రభుత్వం చేపట్టినబడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు కల్పించిన వసతులు గురించి వివరించి, అనుభవ అయినా ఉపాధ్యాయులు ఉన్నారని మా పాఠశాలకు పంపిస్తే క్రమశిక్షణతో విద్యార్థులకు చక్కటి విద్యను అందించి ప్రయోజకులను చేస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 40 మంది విద్యార్థులు చేరారు. ప్రాథమిక పాఠశాల నుంచి 17 మంది, వివిధ ప్రైవేట్ పాఠశాల నుంచి 23 మందిచేరారు. దీంతో పాఠశాలో మొత్తం 103 మంది తిరుగడంతో రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ శ్రీహరి మాట్లాడుతూ... ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించినందుకు ఫలితంగా రికార్డ్ స్థాయిలో అడ్మిషన్ రావడం జరిగిందని అన్నారు. ఈ కృషి స్థానిక సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల సహకారంతో ఇంతటి విజయం సాధించామని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకన్న, పుల్లయ్య, శ్రీదేవి, సుజాత, రమేష్, వెంకట్ రెడ్డి, సురేందర్ మమత ,కిరణ్ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News