Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:23 PM

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ.  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
07-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినం, ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో మంగళవారం ఎమ్మార్పీఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ మాదిగ మణికంఠ, గాంధీనగర్ టీడీపీ నాయకుడు చిన్న, తెలుగు యువత నాయకుడు జి. భవానీ శంకర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు జైభీమ్ విజయ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ జయరాం, జనసేన మండల నాయకుడు పులి రాజు, జైభీమ్ యూత్ ప్రధాన కార్యదర్శి గరిజ నాగరాజు తదితరులు పాల్గొని మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ సాధన, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమం మరింత బలోపేతమై సామాజిక సమానత్వ సాధనలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


కార్యక్రమం అనంతరం ఎమ్మార్పీఎస్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Article Image

ఆదోని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినం, ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో మంగళవారం ఎమ్మార్పీఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ మాదిగ మణికంఠ, గాంధీనగర్ టీడీపీ నాయకుడు చిన్న, తెలుగు యువత నాయకుడు జి. భవానీ శంకర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు జైభీమ్ విజయ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ జయరాం, జనసేన మండల నాయకుడు పులి రాజు, జైభీమ్ యూత్ ప్రధాన కార్యదర్శి గరిజ నాగరాజు తదితరులు పాల్గొని మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ సాధన, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమం మరింత బలోపేతమై సామాజిక సమానత్వ సాధనలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


కార్యక్రమం అనంతరం ఎమ్మార్పీఎస్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News