ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు
ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు
Editor Desk
త్వరలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం: రియా మౌర్య
హైదరాబాద్, జూలై 6
ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని రియా మౌర్య పిలుపునిచ్చారు. నగరంలోని దోమలగూడలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య అవగాహన సదస్సులో ఆమె పాల్గొని స్థానికులకు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు.
దోమలగూడ ప్రాంతంలో మురికి కాలువలు, దోమల సమస్య అధికంగా ఉందని పేర్కొన్న ఆమె, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.
"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని రియా మౌర్య సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి