Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పూర్తయిన జర్నలిస్టుల ఇళ్లకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్‌కు వినతి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 07:28 PM

ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు

ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు

ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు
July 07, 2026 04:23 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

త్వరలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం: రియా మౌర్య

హైదరాబాద్, జూలై 6

ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని రియా మౌర్య పిలుపునిచ్చారు. నగరంలోని దోమలగూడలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య అవగాహన సదస్సులో ఆమె పాల్గొని స్థానికులకు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు.

దోమలగూడ ప్రాంతంలో మురికి కాలువలు, దోమల సమస్య అధికంగా ఉందని పేర్కొన్న ఆమె, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని రియా మౌర్య సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News