భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు
భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు
K.RAVI
* ఘనంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, హోమాలు
* మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ పాటిమీద భక్తాంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాల సప్తమి వార్షికోత్సవ వేడుకలు సోమవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్మాణ దాతలు సోమవారం వెంకటమ్మ సత్తయ్య దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. దాతల చేతుల మీదుగా స్వామివార్లకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు,రుద్రహోమము, ప్రత్యేక అభిషేకాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.ఈ వేడుకల్లో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ సందగళ్ళ నాగరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉడుగు రమేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి