తుంగతుర్తి లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ; ఎమ్మెల్యేమందుల సామేల్
తుంగతుర్తి లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ; ఎమ్మెల్యేమందుల సామేల్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తుంగతుర్తి యందు ఆర్టికల్ 275 (1) Grants -in -Aid నిధులతో నిర్మించు అదనపు వసతి గృహం, టాయిలెట్స్ బ్లాక్ మరియు వంటగది కమ్ డైనింగ్ హాల్ నిర్మాణ శంకుస్థాపన సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను వాడుకొని ఉన్న శిఖరాలకు అవరోధించాలని అన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలలో, కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటేతమ దృష్టికి వస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులు 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తే 50 వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తానని అన్నారు. అనంతరం మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు పంపించేశారు. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 10 లక్షల పరిమితిని పెంచిందని అన్నారు. నూతనగా ఎన్నుకోబడిన వివిధ మండలాల అధ్యక్షులను ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ బేధాలు లేకుండా సమన్వయంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి