Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 09:03 PM

వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్‌కు వికలాంగుల సంఘం వినతి

వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్‌కు వికలాంగుల సంఘం వినతి

వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్‌కు వికలాంగుల సంఘం వినతి
July 06, 2026 06:51 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్,

వెన్నుపూస కండరాల క్షీణిత (Spinal Muscular Atrophy)తో బాధపడుతున్న వికలాంగులకు నెలకు రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దేవిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తమకు నెలకు రూ.4 వేల పింఛన్ మాత్రమే అందుతోందని తెలిపారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 జనవరిలో మరోసారి జీవో వచ్చినా ఇప్పటికీ పింఛన్ పెంపు అమలులోకి రాలేదన్నారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు అధిక పింఛన్ అందుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, అర్హులైన పలువురు వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పింఛన్ కూడా అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను అమలు చేసి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, సభ్యులు దుబ్బ వెంకన్న, నేడు పరమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News