వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్కు వికలాంగుల సంఘం వినతి
వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్కు వికలాంగుల సంఘం వినతి
Editor Desk
నల్గొండ టౌన్,
వెన్నుపూస కండరాల క్షీణిత (Spinal Muscular Atrophy)తో బాధపడుతున్న వికలాంగులకు నెలకు రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్కు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దేవిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తమకు నెలకు రూ.4 వేల పింఛన్ మాత్రమే అందుతోందని తెలిపారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 జనవరిలో మరోసారి జీవో వచ్చినా ఇప్పటికీ పింఛన్ పెంపు అమలులోకి రాలేదన్నారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు అధిక పింఛన్ అందుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, అర్హులైన పలువురు వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పింఛన్ కూడా అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను అమలు చేసి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, సభ్యులు దుబ్బ వెంకన్న, నేడు పరమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి