పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.
పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.
Editor Desk
నారాయణపురం: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండలంలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ గాయత్రి పాఠశాలలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు మనిషి మనుగడకు ఆధారమని, ప్రాణవాయువు, స్వచ్ఛమైన వాతావరణం, నీడ, వర్షపాతం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, వారు మొక్కలను సంరక్షించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలకు నీరు పోశారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి, తాము నాటిన మొక్కలను చెట్లుగా పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్రకృష్ణ, పాఠశాల ఇన్చార్జి ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి