Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:04 AM

పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.

పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.

పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.
06-07-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణపురం: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండలంలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ గాయత్రి పాఠశాలలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు మనిషి మనుగడకు ఆధారమని, ప్రాణవాయువు, స్వచ్ఛమైన వాతావరణం, నీడ, వర్షపాతం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, వారు మొక్కలను సంరక్షించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలకు నీరు పోశారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి, తాము నాటిన మొక్కలను చెట్లుగా పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్రకృష్ణ, పాఠశాల ఇన్‌చార్జి ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.

Article Image

నారాయణపురం: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండలంలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ గాయత్రి పాఠశాలలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు మనిషి మనుగడకు ఆధారమని, ప్రాణవాయువు, స్వచ్ఛమైన వాతావరణం, నీడ, వర్షపాతం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, వారు మొక్కలను సంరక్షించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలకు నీరు పోశారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి, తాము నాటిన మొక్కలను చెట్లుగా పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్రకృష్ణ, పాఠశాల ఇన్‌చార్జి ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News