రామన్నపేట,
భారత మాజీ ఉప ప్రధాని, దళితుల మహానేత డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం రహదారి బంగ్లా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జమీరుద్దీన్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, బండ అంజిరెడ్డి, బొడ్డు శంకరయ్య, మహమ్మద్ అక్రమ్, మహమ్మద్ రిజ్వాన్, కేశవదాసు, ఉదయ్, మహమ్మద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి