Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేనేత సహకార సంఘం డైరెక్టర్‌గా సాయినేత ఏకగ్రీవ ఎన్నిక నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 06:37 PM

బాబూ జగ్జీవన్ రామ్‌కు కాంగ్రెస్ నేతల నివాళి.

బాబూ జగ్జీవన్ రామ్‌కు కాంగ్రెస్ నేతల నివాళి.

బాబూ జగ్జీవన్ రామ్‌కు కాంగ్రెస్ నేతల నివాళి.
July 06, 2026 05:06 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

భారత మాజీ ఉప ప్రధాని, దళితుల మహానేత డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం రహదారి బంగ్లా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జమీరుద్దీన్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, బండ అంజిరెడ్డి, బొడ్డు శంకరయ్య, మహమ్మద్ అక్రమ్, మహమ్మద్ రిజ్వాన్, కేశవదాసు, ఉదయ్, మహమ్మద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News