ముఖర్జీ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
ముఖర్జీ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
Editor Desk
ప్రముఖ జాతీయవాది, భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ దేశ సమైక్యత కోసం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పోరాటం చేశారని పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రత్న మంజుల, అధ్యాపకులు డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ జె. చిన్నబాబు, డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీను, నిర్వాహకులు బాబు, బాబూరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి