Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో స్పాట్ ప్రవేశాలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 05:21 PM

ముఖర్జీ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

ముఖర్జీ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

ముఖర్జీ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
July 06, 2026 03:14 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రముఖ జాతీయవాది, భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ దేశ సమైక్యత కోసం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పోరాటం చేశారని పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రత్న మంజుల, అధ్యాపకులు డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ జె. చిన్నబాబు, డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీను, నిర్వాహకులు బాబు, బాబూరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News