కర్నూలు, :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సత్ప్రవర్తనతో జీవిస్తూ నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి