Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ఆధార్ పార్టీ; పార్టీ వ్యవస్థాపకులు ఈడ శేషగిరి రావు గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 10:41 PM

ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..! హయత్‌నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..! హయత్‌నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..!  హయత్‌నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా
July 05, 2026 08:38 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కమిషన్ ఎదుటే ఫోన్‌పే ద్వారా వసూలు

హయత్ నగర్

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారాన్ని గడువులోగా అందించకపోవడంతో హయత్‌నగర్ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.5 వేల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని కమిషన్ ఎదుటే ఫోన్‌పే ద్వారా చెల్లింపజేయడం చర్చనీయాంశమైంది.

హయత్‌నగర్ మండలానికి చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్‌బాబు చొల్లేటి కొంతకాలం క్రితం ఎంఈవో కార్యాలయం నుంచి కొన్ని వివరాలను కోరుతూ దరఖాస్తు చేశారు. అయితే చట్టంలో నిర్దేశించిన గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

శనివారం జరిగిన విచారణలో ఎంఈవో సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషనర్ దేశాల భూపాల్ నిర్ధారించారు. దీంతో ఆర్టీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా విధించారు.

జరిమానా మొత్తాన్ని అక్కడికక్కడే డిజిటల్ చెల్లింపు యాప్ 'ఫోన్‌పే' ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ చేయించాలని ఆదేశించగా, ఎంఈవో వెంటనే చెల్లించారు. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసే అధికారులపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News