ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..! హయత్నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా
ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..! హయత్నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా
Editor Desk
కమిషన్ ఎదుటే ఫోన్పే ద్వారా వసూలు
హయత్ నగర్
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారాన్ని గడువులోగా అందించకపోవడంతో హయత్నగర్ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్కు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.5 వేల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని కమిషన్ ఎదుటే ఫోన్పే ద్వారా చెల్లింపజేయడం చర్చనీయాంశమైంది.
హయత్నగర్ మండలానికి చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్బాబు చొల్లేటి కొంతకాలం క్రితం ఎంఈవో కార్యాలయం నుంచి కొన్ని వివరాలను కోరుతూ దరఖాస్తు చేశారు. అయితే చట్టంలో నిర్దేశించిన గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్ను ఆశ్రయించారు.
శనివారం జరిగిన విచారణలో ఎంఈవో సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషనర్ దేశాల భూపాల్ నిర్ధారించారు. దీంతో ఆర్టీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా విధించారు.
జరిమానా మొత్తాన్ని అక్కడికక్కడే డిజిటల్ చెల్లింపు యాప్ 'ఫోన్పే' ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ చేయించాలని ఆదేశించగా, ఎంఈవో వెంటనే చెల్లించారు. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసే అధికారులపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి