నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
Reporter shekar
నిజామాబాద్ జిల్లాలో శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ,పంచాయతీ రాజ్ &రూరల్ డెవలప్ మెంట్ మంత్రి జిల్లా ఇంచార్జి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 6.5 కోట్లతో చేపట్టబోయే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్ జూనియర్ బాలికల కళాశాల అదనపు వసతి భవనాన్ని ప్రారంభించారు.ఇందల్వాయి మండలం లోని పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న మంత్రి సీతక్క ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని అన్నారు.బిఆర్ఎస్ మరియు ఇతర ప్రతి పక్షాలు పని లేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,మేయర్ ఉమారాణి,డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్హుందాన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి