నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతిచెందిన విషాదఘటన సోమవారంచోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంక బుడ్డి నాగరాజు యాదవ్ (గొర్రెల కాపరి) గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
నాగరాజు యాదవ్కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కుటుంబానికి ఆధారంగా ఉన్న నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గ్రామస్తులు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి