Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 09:06 PM

రెండో విడతలో 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి కొండ్రపోలు గ్రామ నిరుపేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

రెండో విడతలో 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి కొండ్రపోలు గ్రామ నిరుపేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

రెండో విడతలో 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి కొండ్రపోలు గ్రామ నిరుపేదలకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి
June 22, 2026 07:52 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దామచర్ల, : కొండ్రపోలు గ్రామంలోని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రెండో విడతలో భాగంగా కనీసం 100 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ గ్రామ 9వ వార్డు సభ్యుడు పంతంగి సురేష్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

గ్రామంలో సుమారు 3,500 మంది జనాభా నివసిస్తున్నారని, అందులో 150కుపైగా నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు లేవని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కుటుంబాలందరికీ సొంత ఇంటి స్థలాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోతున్నారని వివరించారు.

150 కుటుంబాలు ఆశగా ఎదురుచూపులు

గ్రామంలోని పేద కుటుంబాలు ప్రభుత్వ గృహ పథకాలపై ఆశలు పెట్టుకున్నాయని, మొదటి విడతలో అవకాశం దక్కని అర్హులైన కుటుంబాలను గుర్తించి రెండో విడతలో కనీసం 100 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం

ఇల్లు లేని నిరుపేదల పరిస్థితిని పరిశీలించి, వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు పంతంగి సురేష్ తెలిపారు. గ్రామంలోని పేదల గృహ కల సాకారం కావాలంటే రెండో విడతలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News