PRINT TIME: June 22, 2026 10:10 PM
గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు
గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు
June 22, 2026 08:12 PM
93 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా ఆరూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి నాయకోటి లావణ్య–మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన మాజీ సర్పంచ్ నాయకోటి మధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాదరి విఠల్, గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ సిబ్బంది మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి