ఉప సర్పంచ్ల హక్కులను కాపాడాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి వినతిపత్రం అందజేత
ఉప సర్పంచ్ల హక్కులను కాపాడాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి వినతిపత్రం అందజేత
K.RAVI
చెక్ పవర్ రద్దు వార్తలపై ఆందోళన
గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ల హక్కుల పరిరక్షణకు, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ మండల ఉప సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బోట్ల కార్తీక్, రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలరాజుల ఆదేశాల మేరకు.. చౌటుప్పల్ మండల ఫోరం అధ్యక్షుడు బొమ్మకంటి కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ప్రజాప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికలు, టెలివిజన్ ఛానళ్లలో ఉప సర్పంచ్ల చెక్కు సంతకం అధికారాలను రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఉప సర్పంచ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉప సర్పంచ్లకు ప్రస్తుతం ఉన్న హక్కులు, అధికారాలను యథాతథంగా కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు.గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక భద్రత లేకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న తమకు గౌరవప్రదమైన నెలవారీ వేతనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప సర్పంచ్ల వినతిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సమస్యలు న్యాయమైనవని.. వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, మండల ఉపాధ్యక్షులు బాతరాజు ధనుంజయ్, మండల ప్రధాన కార్యదర్శి బోయ సదానందం, వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల సురేందర్ రెడ్డి, మండలంలోని ఉప సర్పంచ్లు ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి, గడ్డం సత్యం, ఉప్పునూతల నరసింహ, పెరుమాండ్ల లింగస్వామి, ప్రభాకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి