Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 09:16 PM

సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా

సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా

సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా
June 22, 2026 07:45 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, త్వరితగతిన న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News