సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా
సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా
Krishna
సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, త్వరితగతిన న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి