*దేవాదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి సామాజిక కార్యకర్తలు
*దేవాదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి సామాజిక కార్యకర్తలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ గా పదోన్నతి పై వెళ్ళిన ఎం. హనుమంతరావు ను సోమవారం హైదరాబాద్ లోని కార్యాలయంలో భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్తలు బర్రె సుదర్శన్, నల్ల కృష్ణ లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాలువా, మెమెంటో లతో ఎండోమెంట్ డైరెక్టర్ ఎం. హనుమంతరావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న , ముఖ్యంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో పనిచేస్తున్న ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పదోన్నతి విషయంలో పారదర్శకత పాటించాలని బర్రె సుదర్శన్ డైరెక్టర్ ను కోరారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ హనుమంతరావు ఆత్మీయంగా ఆహ్వానించారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ముఖ్యంగా ఎస్సీ/ ఎస్టీ ల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు బర్రె సుదర్శన్ మీడియాతో తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి