Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్.. పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 07:11 PM

ఆర్థిక కష్టాల్లో ఉన్నత చదువుల కల.. ఆదుకున్న అమెరికా 'కానా' సంస్థ: విద్యార్థిని ఫీజు చెల్లింపు!

ఆర్థిక కష్టాల్లో ఉన్నత చదువుల కల.. ఆదుకున్న అమెరికా 'కానా' సంస్థ: విద్యార్థిని ఫీజు చెల్లింపు!

ఆర్థిక కష్టాల్లో ఉన్నత చదువుల కల.. ఆదుకున్న అమెరికా 'కానా' సంస్థ: విద్యార్థిని ఫీజు చెల్లింపు!
June 21, 2026 04:18 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేదరికం కారణంగా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో ‘కానా’ (KANA) స్వచ్ఛంద సంస్థ మరోమారు తన ఉదారతను చాటుకుంది. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ, ఆర్థిక స్తోమత లేక ఇంటర్మీడియట్ చదువు కొనసాగించలేని స్థితిలో ఉన్న సల్లూరి ప్రియమణి అనే విద్యార్థినికి కానా సంస్థ అండగా నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే...

సల్లూరి సత్తయ్య గౌడ్ కుమార్తె అయిన ప్రియమణి, పదో తరగతి పరీక్షల్లో 570/600 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచింది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె పైచదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు (డి.ఆర్.పి, కౌన్సిలర్) దత్తు, బోటనీ లెక్చరర్ వీరబాబులు స్పందించారు. వారు ‘కానా’ సంస్థ గురించి తెలుసుకొని, విద్యార్థిని దీనస్థితిని కానా స్థానిక ప్రతినిధి గణేష్ నాతి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన అమెరికా ‘కానా’ బృందం

సమాచారం అందుకున్న వెంటనే అమెరికాలో ఉన్న ‘కానా’ సంస్థ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. ప్రియమణి ఇంటర్ మొదటి సంవత్సరం చదువు నిమిత్తం రూ. 80,000 ఫీజును మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని సంస్థ స్థానిక ప్రతినిధులు నాతి గణేష్, బాల్నే రామచంద్రుడుల ద్వారా కాలేజీకి చెల్లించి, విద్యార్థినికి చేయూతనిచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థిని ప్రియమణి మాట్లాడుతూ... తనకు ఆర్థిక సహాయం అందించి చదువుకునే అవకాశం కల్పించిన కానా సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది. ఇంటర్‌లో కూడా మరింత కష్టపడి చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.

మానవతా దృక్పథానికి నిదర్శనం: ఆల్ఫోర్స్ ప్రిన్సిపాల్

ఎలాంటి రక్తసంబంధం లేకపోయినప్పటికీ, కేవలం మానవతా దృక్పథంతో ఒక పేద విద్యార్థిని చదువు కోసం ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన ‘కానా’ సంస్థకు ఆల్ఫోర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కేశవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ‘కానా’ ప్రతినిధులతో పాటు ప్రభుత్వ టీచర్ దత్తు, ఆల్ఫోర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కేశవ్, సాయి కృష్ణ, వీరబాబు తదితరులు పాల్గొని విద్యార్థిని ప్రియమణిని భవిష్యత్తుపై గైడెన్స్ ఇస్తూ మోటివేట్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News