Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.  పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్
21-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే యోగా సాధన అలవాటు చేసుకుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సర్పంచ్ స్వయంగా పలు యోగాసనాలు వేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ వివిధ ఆసనాల ప్రాముఖ్యతను, వాటి ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్కు వెంకట్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నేరటి మౌనిక సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, గ్రామ పెద్దలు అంతటి మల్లేశం, నేరటి రమేష్, కే. రాజు గౌడ్, బద్దుల నరసింహ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే యోగా సాధన అలవాటు చేసుకుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సర్పంచ్ స్వయంగా పలు యోగాసనాలు వేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ వివిధ ఆసనాల ప్రాముఖ్యతను, వాటి ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్కు వెంకట్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నేరటి మౌనిక సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, గ్రామ పెద్దలు అంతటి మల్లేశం, నేరటి రమేష్, కే. రాజు గౌడ్, బద్దుల నరసింహ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News