ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్
Editor Desk
రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే యోగా సాధన అలవాటు చేసుకుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సర్పంచ్ స్వయంగా పలు యోగాసనాలు వేశారు. యోగా ఇన్స్ట్రక్టర్ వివిధ ఆసనాల ప్రాముఖ్యతను, వాటి ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్కు వెంకట్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నేరటి మౌనిక సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, గ్రామ పెద్దలు అంతటి మల్లేశం, నేరటి రమేష్, కే. రాజు గౌడ్, బద్దుల నరసింహ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి