Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్.. పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 06:11 PM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.  పాఠశాల వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ సాయికుమార్ గౌడ్
June 21, 2026 01:56 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే యోగా సాధన అలవాటు చేసుకుంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సర్పంచ్ స్వయంగా పలు యోగాసనాలు వేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ వివిధ ఆసనాల ప్రాముఖ్యతను, వాటి ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్కు వెంకట్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నేరటి మౌనిక సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, గ్రామ పెద్దలు అంతటి మల్లేశం, నేరటి రమేష్, కే. రాజు గౌడ్, బద్దుల నరసింహ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News