ఏఐ, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ విజయవంతం
ఏఐ, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ విజయవంతం
Editor Desk
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన “ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్” టీచింగ్ ఇంటర్న్షిప్ శనివారం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో “అన్న అక్క మెంటార్షిప్/ఇంటర్న్షిప్” కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ నిర్వహించారు.
ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్బాబు అధ్యక్షత వహించగా, మాస్టర్ ట్రైనర్ డా. పి. బిక్షపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఏఐ సాధనాలు విద్యార్థులను మెరుగైన అభ్యాసకులు, ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నోడల్ అధికారులను అభినందించారు.
ఫీడ్బ్యాక్ సమావేశంలో విద్యార్థులు శిక్షణపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత బోధన, మూల్యాంకన పద్ధతులు భవిష్యత్ బోధనా వృత్తిలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తరగతి గదుల్లో ఏఐని నైతికంగా వినియోగించే అవగాహన ఈ కార్యక్రమం ద్వారా కలిగిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐకి సిద్ధంగా ఉండే పట్టభద్రులను తయారు చేసే దిశగా ఈ ఇంటర్న్షిప్ ఉపయోగపడిందని డాక్టర్ బాల నరసింహ తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి