Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్.. పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 06:31 PM

ఏఐ, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ విజయవంతం

ఏఐ, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ విజయవంతం

ఏఐ, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ విజయవంతం
June 21, 2026 01:48 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన “ఏఐ అండ్ డిజిటల్ లెర్నింగ్” టీచింగ్ ఇంటర్న్‌షిప్ శనివారం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో “అన్న అక్క మెంటార్‌షిప్/ఇంటర్న్‌షిప్” కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ నిర్వహించారు.

ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అధ్యక్షత వహించగా, మాస్టర్ ట్రైనర్ డా. పి. బిక్షపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఏఐ సాధనాలు విద్యార్థులను మెరుగైన అభ్యాసకులు, ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నోడల్ అధికారులను అభినందించారు.

ఫీడ్‌బ్యాక్ సమావేశంలో విద్యార్థులు శిక్షణపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత బోధన, మూల్యాంకన పద్ధతులు భవిష్యత్ బోధనా వృత్తిలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తరగతి గదుల్లో ఏఐని నైతికంగా వినియోగించే అవగాహన ఈ కార్యక్రమం ద్వారా కలిగిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐకి సిద్ధంగా ఉండే పట్టభద్రులను తయారు చేసే దిశగా ఈ ఇంటర్న్‌షిప్ ఉపయోగపడిందని డాక్టర్ బాల నరసింహ తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News