Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్ పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 09:31 PM

రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి

రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి

రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి
June 20, 2026 08:18 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఎస్సీల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ

ముప్పై ఏళ్ల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నెరవేరిన నేపథ్యంలో, ప్రతి మాదిగ బిడ్డా విద్యా, ఉద్యోగాల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భునవగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న తరుణంలో, చదువుకు దూరమైన మాదిగ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపేలా గ్రామాల్లో కుల పెద్దలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామగ్రామాన జెండా ఆవిష్కరణలు, జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాలు జయప్రదం చేయాలన్నారు.గతంలో వలిగొండ మండలం లింగరాజుపల్లిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు హత్యకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు చాట్ల పాండు కేసులో సాక్షులకు రక్షణ కల్పించి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బోయ లింగస్వామి, బొడ్డు శ్రావణ్ కుమార్, మంచాల మహేష్, పాముకుట్ల భాస్కర్, చాట్ల శివ,సాయి సందీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News