రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి
రిజర్వేషన్ల వర్గీకరణను సద్వినియోగం చేసుకోవాలి
K.RAVI
* ఎస్సీల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ
ముప్పై ఏళ్ల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నెరవేరిన నేపథ్యంలో, ప్రతి మాదిగ బిడ్డా విద్యా, ఉద్యోగాల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భునవగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న తరుణంలో, చదువుకు దూరమైన మాదిగ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపేలా గ్రామాల్లో కుల పెద్దలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామగ్రామాన జెండా ఆవిష్కరణలు, జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాలు జయప్రదం చేయాలన్నారు.గతంలో వలిగొండ మండలం లింగరాజుపల్లిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు హత్యకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు చాట్ల పాండు కేసులో సాక్షులకు రక్షణ కల్పించి, నిందితులకు శిక్ష పడేలా చూడాలని చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బోయ లింగస్వామి, బొడ్డు శ్రావణ్ కుమార్, మంచాల మహేష్, పాముకుట్ల భాస్కర్, చాట్ల శివ,సాయి సందీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి