Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
20-06-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జీఓ నంబర్ 44 విడుదల చేసిన ప్రభుత్వం

* న్యాయవాదుల హర్షాతిరేకాలు.. బార్ అసోసియేషన్‌లో మిఠాయిల పంపిణీ

చౌటుప్పల్ న్యాయస్థాన పరిధి (జూరిస్డిక్షన్) లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 44ను విడుదల చేసినట్లు చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ వెల్లడించారు. చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులందరూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ సందర్భంగా అధ్యక్షులు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. అదనపు కోర్టు ఏర్పాటుతో కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నరసింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగొని శ్రీశైలం, డైరెక్టర్లు నకరికంటి జ్యోతి, ఎండీ ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకట చలపతి, సీనియర్ న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, చామట్ల జంగయ్య, భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

Article Image

* జీఓ నంబర్ 44 విడుదల చేసిన ప్రభుత్వం

* న్యాయవాదుల హర్షాతిరేకాలు.. బార్ అసోసియేషన్‌లో మిఠాయిల పంపిణీ

చౌటుప్పల్ న్యాయస్థాన పరిధి (జూరిస్డిక్షన్) లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 44ను విడుదల చేసినట్లు చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ వెల్లడించారు. చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులందరూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ సందర్భంగా అధ్యక్షులు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. అదనపు కోర్టు ఏర్పాటుతో కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నరసింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగొని శ్రీశైలం, డైరెక్టర్లు నకరికంటి జ్యోతి, ఎండీ ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకట చలపతి, సీనియర్ న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, చామట్ల జంగయ్య, భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News