చౌటుప్పల్కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
చౌటుప్పల్కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
K.RAVI
* జీఓ నంబర్ 44 విడుదల చేసిన ప్రభుత్వం
* న్యాయవాదుల హర్షాతిరేకాలు.. బార్ అసోసియేషన్లో మిఠాయిల పంపిణీ
చౌటుప్పల్ న్యాయస్థాన పరిధి (జూరిస్డిక్షన్) లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 44ను విడుదల చేసినట్లు చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ వెల్లడించారు. చౌటుప్పల్కు అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులందరూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. అదనపు కోర్టు ఏర్పాటుతో కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నరసింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగొని శ్రీశైలం, డైరెక్టర్లు నకరికంటి జ్యోతి, ఎండీ ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకట చలపతి, సీనియర్ న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, చామట్ల జంగయ్య, భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి