Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన సందర్భంగా వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 08:48 PM

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
June 20, 2026 07:04 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జీఓ నంబర్ 44 విడుదల చేసిన ప్రభుత్వం

* న్యాయవాదుల హర్షాతిరేకాలు.. బార్ అసోసియేషన్‌లో మిఠాయిల పంపిణీ

చౌటుప్పల్ న్యాయస్థాన పరిధి (జూరిస్డిక్షన్) లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 44ను విడుదల చేసినట్లు చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ వెల్లడించారు. చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులందరూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ సందర్భంగా అధ్యక్షులు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. అదనపు కోర్టు ఏర్పాటుతో కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందని, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నరసింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగొని శ్రీశైలం, డైరెక్టర్లు నకరికంటి జ్యోతి, ఎండీ ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకట చలపతి, సీనియర్ న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, చామట్ల జంగయ్య, భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News