Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 08:10 PM

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
June 20, 2026 06:04 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్‌లో ఆర్డివో శేఖర్ రెడ్డి కి సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కందుకూరి కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముటుకుల్లోజు శ్రావణ్ కుమార్, కోశాధికారి చొల్లేటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన స్వర్ణకారుల పరిస్థితి నేడు నానాటికీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులతో జువెలరీ షాపులను ఏర్పాటు చేస్తూ, మోసపూరిత ఆర్భాటపు ప్రకటనలతో స్థానిక స్వర్ణకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి స్వర్ణకారులను తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి పాలకమండలిని నియమించాలి. దొంగ బంగారం రికవరీల పేరుతో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న పోలీసు వేధింపులను అరికట్టడానికి, జీఓ 272ను సవరించి పటిష్టంగా అమలు చేయాలి.50 సంవత్సరాలు దాటిన స్వర్ణకార వృత్తిదారులకు గీత, నేత కార్మికుల తరహాలోనే నెలకు రూ. 5,000/- జీవనభృతి (పెన్షన్) మంజూరు చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు కొండోజు సంతోష్ కుమార్, చేపురి లక్ష్మణాచారి, డి.వి. చారి, పెరికేటి గోపాలాచారి, మల్లికార్జున్ , నాగేష్, శ్రీను, రాఘవ, పాండు, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News