స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
K.RAVI
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్లో ఆర్డివో శేఖర్ రెడ్డి కి సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కందుకూరి కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముటుకుల్లోజు శ్రావణ్ కుమార్, కోశాధికారి చొల్లేటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన స్వర్ణకారుల పరిస్థితి నేడు నానాటికీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులతో జువెలరీ షాపులను ఏర్పాటు చేస్తూ, మోసపూరిత ఆర్భాటపు ప్రకటనలతో స్థానిక స్వర్ణకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి స్వర్ణకారులను తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి, దానికి పాలకమండలిని నియమించాలి. దొంగ బంగారం రికవరీల పేరుతో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న పోలీసు వేధింపులను అరికట్టడానికి, జీఓ 272ను సవరించి పటిష్టంగా అమలు చేయాలి.50 సంవత్సరాలు దాటిన స్వర్ణకార వృత్తిదారులకు గీత, నేత కార్మికుల తరహాలోనే నెలకు రూ. 5,000/- జీవనభృతి (పెన్షన్) మంజూరు చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు కొండోజు సంతోష్ కుమార్, చేపురి లక్ష్మణాచారి, డి.వి. చారి, పెరికేటి గోపాలాచారి, మల్లికార్జున్ , నాగేష్, శ్రీను, రాఘవ, పాండు, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి