సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు
సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు
Sthanikam District Staff Reporter
భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఆశ్రమ ఇంచార్జ్ సాయిబాబా
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు శ్రీ రమణానంద మహర్షి మఠంపై హిందూ వాహిని జనశక్తి చెందిన లలిత్ కుమార్ రెడ్డి అతని అనుచరులు అసత్య ఆరోపణలు అవమానవీయ త్వరలో అసత్యాలను ప్రచారం చేసేందుకు పూనుకోవడం ఏయమైన చర్యని సాయిబాబా నిశితంగా విమర్శించారు. గత 25 సంవత్సరాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో సద్గురు శ్రీ రమణనంద మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసి అందులో దేశ విదేశాలనుండి వస్తున్న భక్తులను మనోభావాలకు అనుగుణంగా ఆశ్రమమును అభివృద్ధి చేయడమే కాక సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. అంతేకాక ఒకే సన్నిధిలో ప్రాచీన గ్రంధాలు భగవాన్ రమణ మహర్షి వంటి ధ్యానులు అందించిన జ్ఞానంతో మహర్షి స్థితిని చేరుకోవడం జరుగుతుందని ఆయన వర్ణించారు మౌనం సాధన మనోతపస్సు సాక్షి భావంతో సిద్ధించిన వారికి రమణ మహర్షి అని అన్నారు ప్రపంచంలో మొదటిదైన బంగారు శివలింగాలు 23 అడుగుల ఏకశిలా బాల లింగం శ్రీ చక్ర ఆలయం పరాశక్తి దశ మహా విద్యల విగ్రహాలు కలిగిన రమణాేశ్వరం హిందూ ధర్మానికి ప్రతికగా నిలుస్తోందని అన్నారు అటువంటి మహా పురుషులు నివసించే రమనేశ్వరంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహం ఆపీఠం చూసి లేక హిందూ జనశక్తి నాయకులు విమర్శించడం హిందూత్వలేమి మనసత్వానికి ప్రతిబింబిస్తుందని ఆయన నిశితంగా విమర్శించారు. ఆశ్రమంపై మనోభా భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై ఉపేక్షించేది లేదని సమాజంలో గుర్తింపు కోసం విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయడం నిదర్శనమని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి