Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:32 PM

కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....

కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....

కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....
June 22, 2026 11:45 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఉమార్ తో కలిసి పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం యోగాను తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు పారాలీగల్ వాలంటీర్లు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జానీ పాషా, ట్రెజరర్ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News