కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....
కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....
Harish K
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఉమార్ తో కలిసి పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం యోగాను తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు పారాలీగల్ వాలంటీర్లు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జానీ పాషా, ట్రెజరర్ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి