Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:07 AM

జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి

జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి

జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి
07-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

తెలంగాణ సాధనకు జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన సేవలు చిరస్మరణీయం – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్

నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ జయంతి వేడుకలను నల్గొండలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర అపూర్వమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని మూడు దశల్లో ముందుకు నడిపించారని, మొదటి దశలో తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తరించారని, రెండో దశలో ఉద్యమ ప్రచారాన్ని బలోపేతం చేశారని, మూడో దశలో రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.

జయశంకర్ సార్ జీవితంలో కూడా మూడు కీలక దశలు ఉన్నాయని ఆయన వివరించారు. విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా, ఉద్యోగ జీవితంలో ఉద్యోగుల సమస్యలతో పాటు తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ పోరాడారని, పదవీ విరమణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నిరంతరం కృషి చేశారని తెలిపారు. 2011 జూన్ 21న ఆయన కన్నుమూయడం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ తత్వవేత్త, తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, కె. శివరాణి, డాక్టర్ ఆదే మల్లేశం, ఎం. సావిత్రి, హబీబ్, దినేష్, అంకుష్, స్రవంతి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.


Sthanikam

జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి

Article Image

తెలంగాణ సాధనకు జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన సేవలు చిరస్మరణీయం – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్

నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ జయంతి వేడుకలను నల్గొండలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర అపూర్వమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని మూడు దశల్లో ముందుకు నడిపించారని, మొదటి దశలో తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తరించారని, రెండో దశలో ఉద్యమ ప్రచారాన్ని బలోపేతం చేశారని, మూడో దశలో రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.

జయశంకర్ సార్ జీవితంలో కూడా మూడు కీలక దశలు ఉన్నాయని ఆయన వివరించారు. విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా, ఉద్యోగ జీవితంలో ఉద్యోగుల సమస్యలతో పాటు తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ పోరాడారని, పదవీ విరమణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నిరంతరం కృషి చేశారని తెలిపారు. 2011 జూన్ 21న ఆయన కన్నుమూయడం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ తత్వవేత్త, తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, కె. శివరాణి, డాక్టర్ ఆదే మల్లేశం, ఎం. సావిత్రి, హబీబ్, దినేష్, అంకుష్, స్రవంతి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News