Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:01 AM

వసతి గృహాల్లో సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి

వసతి గృహాల్లో సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి

వసతి గృహాల్లో సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి
07-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేలపట్ల ఎస్సీ హాస్టల్‌లో మున్సిపల్ కమిషనర్ 'హాస్టల్ నిద్ర'

విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 'హాస్టల్ నిద్ర' కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఆయన సందర్శించి, పర్యవేక్షించారు.​ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులతో ముచ్చటించి వారి వివరాలు, చదువు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు హాస్టల్‌లోని వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్ నాగ సైదులును ఆదేశించారు.​ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన నోట్‌బుక్స్, ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

వసతి గృహాల్లో సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి

Article Image

నేలపట్ల ఎస్సీ హాస్టల్‌లో మున్సిపల్ కమిషనర్ 'హాస్టల్ నిద్ర'

విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 'హాస్టల్ నిద్ర' కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఆయన సందర్శించి, పర్యవేక్షించారు.​ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులతో ముచ్చటించి వారి వివరాలు, చదువు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు హాస్టల్‌లోని వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్ నాగ సైదులును ఆదేశించారు.​ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన నోట్‌బుక్స్, ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News