నేలపట్ల ఎస్సీ హాస్టల్లో మున్సిపల్ కమిషనర్ 'హాస్టల్ నిద్ర'
విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 'హాస్టల్ నిద్ర' కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను ఆయన సందర్శించి, పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులతో ముచ్చటించి వారి వివరాలు, చదువు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు హాస్టల్లోని వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్ నాగ సైదులును ఆదేశించారు.ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన నోట్బుక్స్, ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి