చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి
చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–65 పక్కన ఉన్న ‘7 హోటల్’ సమీపంలో ఓ లారీ క్లీనర్ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన లకేంద్ర (33)గా గుర్తించారు.
ఉపాధి నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చిట్యాలకు చేరుకున్న వారికి హోటల్ సమీపంలో కేంద్ర మృతదేహం కనిపించింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లకేంద్ర, సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం తో పాటు ఇటీవల నమోదవుతున్న తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వారు పోలీసులకు తెలిపారు.మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి