Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 AM

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి
21-06-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–65 పక్కన ఉన్న ‘7 హోటల్’ సమీపంలో ఓ లారీ క్లీనర్ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన లకేంద్ర (33)గా గుర్తించారు.

ఉపాధి నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చిట్యాలకు చేరుకున్న వారికి హోటల్ సమీపంలో కేంద్ర మృతదేహం కనిపించింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లకేంద్ర, సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం తో పాటు ఇటీవల నమోదవుతున్న తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వారు పోలీసులకు తెలిపారు.మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Sthanikam

చిట్యాల సమీపంలో లారీ క్లీనర్ మృతి

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–65 పక్కన ఉన్న ‘7 హోటల్’ సమీపంలో ఓ లారీ క్లీనర్ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన లకేంద్ర (33)గా గుర్తించారు.

ఉపాధి నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన లకేంద్ర గత రెండు రోజులుగా కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం చిట్యాలకు చేరుకున్న వారికి హోటల్ సమీపంలో కేంద్ర మృతదేహం కనిపించింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లకేంద్ర, సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం తో పాటు ఇటీవల నమోదవుతున్న తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వారు పోలీసులకు తెలిపారు.మృతుడి మేనబావ దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News