Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
21-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


అంగన్‌వాడీ భవనం ప్రారంభం.. ఉచిత నేత్ర చికిత్స శిబిరానికి శ్రీకారం


రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, యువత విజ్ఞాన వికాసానికి ఉపయోగపడేలా మరమ్మతులు పూర్తి చేసిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన, నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మొగ్గు చూపడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కంటి ఆరోగ్యంపై అవగాహన అవసరంఅనంతరం ఉరుమడ్లలోని తన స్వగృహంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరంలో కళ్ళు అత్యంత విలువైన అవయవమని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గ్రామ ప్రజల కోసం శంకర నేత్రాలయం అత్యాధునిక వైద్య సదుపాయాలు, శస్త్రచికిత్స ఏర్పాట్లతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, వనమా వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Article Image


అంగన్‌వాడీ భవనం ప్రారంభం.. ఉచిత నేత్ర చికిత్స శిబిరానికి శ్రీకారం


రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, యువత విజ్ఞాన వికాసానికి ఉపయోగపడేలా మరమ్మతులు పూర్తి చేసిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరలో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన, నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మొగ్గు చూపడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కంటి ఆరోగ్యంపై అవగాహన అవసరంఅనంతరం ఉరుమడ్లలోని తన స్వగృహంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరంలో కళ్ళు అత్యంత విలువైన అవయవమని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గ్రామ ప్రజల కోసం శంకర నేత్రాలయం అత్యాధునిక వైద్య సదుపాయాలు, శస్త్రచికిత్స ఏర్పాట్లతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, వనమా వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News