సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక
సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక
Krishna
సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా, జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నామ్లిమేట్ గ్రామం నారాయణఖేడ్ మండల ఉప సర్పంచ్ ను రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఈ. కిశోర్ కుమార్కు కీలక బాధ్యతలు అప్పగించగా, టేకూర్ ఉప సర్పంచ్ నర్సింలును జిల్లా అధ్యక్షుడిగా, మల్కాపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి