జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరిక..
జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరిక..
NM Yadav
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్..
నల్గొండ : సమాజంలో ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలపై కథనాలు రాసే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డీఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. 'జనం సాక్షి' దినపత్రిక నల్గొండ బ్యూరో ప్రతినిధి ఓడపల్లి మధుపై కొందరు నిరాధారమైన, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయమై డీఎస్పీ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వన్టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావులను ఆయన ఆదేశించారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించం జర్నలిస్టు సంఘాలు..
అసలైన జర్నలిస్టులను నకిలీ జర్నలిస్టులుగా చిత్రీకరిస్తూ వారి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినతిపత్రంలో జర్నలిస్టుల ముఖ్య డిమాండ్లు..
క్షేత్రస్థాయిలో వార్తలు రాసే పాత్రికేయుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదు. సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. సమాజంలో మీడియా స్వేచ్ఛను కాపాడటంతో పాటు, జర్నలిస్టుల భద్రతకు పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టాలి. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుండగొని జయశంకర్, గాదె రమేష్, నకరబోయిన మల్లేశంయాదవ్, గుండాల యాదగిరి, సలీం, అల్లి మల్లికార్జున్, దండంపల్లి రవి, వెంకట మధు, కుషాల్, శంకర్, హరి, సుధాకర్, ఎండీ కలీమ్ ఖాన్, నవీన్, సైదులు, శివ, సూర్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి