12 ఏళ్లలో అభివృద్ధే ధ్యేయం. తెలంగాణ పురోగతికి కేంద్రం అండగా నిలుస్తోంది: డా. కె. లక్ష్మణ్
12 ఏళ్లలో అభివృద్ధే ధ్యేయం. తెలంగాణ పురోగతికి కేంద్రం అండగా నిలుస్తోంది: డా. కె. లక్ష్మణ్
Komidala Mahender reddy
హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత రంగాల్లో విశేష పురోగతి సాధించిందని రాజ్యసభ సభ్యుడు కె . లక్ష్మణ్ డా. కె. లక్ష్మణ్ అన్నారు. కవాడిగూడలో పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన ‘వార్త’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, వంటగ్యాస్, ఆరోగ్య రక్షణ, బ్యాంకు ఖాతాలు, స్వయం ఉపాధి పథకాలు కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ అనుసంధానంతో ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారులకు చేరే విధానం పారదర్శకతను పెంచిందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, గత 12 ఏళ్లలో రాష్ట్రంలో వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే మార్గాల విస్తరణ, రైల్వే కేంద్రాల ఆధునికీకరణ వంటి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.
అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి చెందిన భారతదేశం సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతోందని డా. లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కస్తూరి సుధాకర్రావు, పత్రికా సమాచార కార్యాలయం అదనపు ప్రధాన సంచాలకురాలు శృతి పాటిల్ శృతి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి