Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన సందర్భంగా వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 08:48 PM

12 ఏళ్లలో అభివృద్ధే ధ్యేయం. తెలంగాణ పురోగతికి కేంద్రం అండగా నిలుస్తోంది: డా. కె. లక్ష్మణ్

12 ఏళ్లలో అభివృద్ధే ధ్యేయం. తెలంగాణ పురోగతికి కేంద్రం అండగా నిలుస్తోంది: డా. కె. లక్ష్మణ్

12 ఏళ్లలో అభివృద్ధే ధ్యేయం. తెలంగాణ పురోగతికి కేంద్రం అండగా నిలుస్తోంది: డా. కె. లక్ష్మణ్
June 20, 2026 07:20 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత రంగాల్లో విశేష పురోగతి సాధించిందని రాజ్యసభ సభ్యుడు కె . లక్ష్మణ్ డా. కె. లక్ష్మణ్ అన్నారు. కవాడిగూడలో పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన ‘వార్త’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, వంటగ్యాస్, ఆరోగ్య రక్షణ, బ్యాంకు ఖాతాలు, స్వయం ఉపాధి పథకాలు కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ అనుసంధానంతో ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారులకు చేరే విధానం పారదర్శకతను పెంచిందన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, గత 12 ఏళ్లలో రాష్ట్రంలో వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే మార్గాల విస్తరణ, రైల్వే కేంద్రాల ఆధునికీకరణ వంటి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.

అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి చెందిన భారతదేశం సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతోందని డా. లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కస్తూరి సుధాకర్‌రావు, పత్రికా సమాచార కార్యాలయం అదనపు ప్రధాన సంచాలకురాలు శృతి పాటిల్ శృతి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News