ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
Bandi Kiran Kumar
తుంగతుర్తి; ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడి పాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, బట్టలు, ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఫ్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించారని ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఇంగ్లీషు బోధించాలని పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య, తుంగతుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయులు చిత్తలూరి కలమ్మ ,పాల్వాయి గురువయ్య, మందడి సూర్యప్రకాష్, చిత్తలూరి శ్రీరాములు ,గుండ గాని సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి