Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.
15-06-2026 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్న పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించి అధిక మొత్తాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. సీబీఎస్‌ఈ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తున్నారని విమర్శించారు. ‘మోడల్ స్కూల్’ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.

గ్రామీణ ప్రాంతమైన రామన్నపేటలో అధిక ఫీజుల సంస్కృతిని తీసుకొచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి అనుమతులు ఉండవని, అయినప్పటికీ పదో తరగతి వరకు బోధన ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను తనిఖీ చేసి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా గర్ల్స్‌ కన్వీనర్ ఇందురాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

Article Image

రామన్నపేట: నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్న పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించి అధిక మొత్తాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. సీబీఎస్‌ఈ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తున్నారని విమర్శించారు. ‘మోడల్ స్కూల్’ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.

గ్రామీణ ప్రాంతమైన రామన్నపేటలో అధిక ఫీజుల సంస్కృతిని తీసుకొచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి అనుమతులు ఉండవని, అయినప్పటికీ పదో తరగతి వరకు బోధన ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను తనిఖీ చేసి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా గర్ల్స్‌ కన్వీనర్ ఇందురాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News