Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 11:11 PM

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.

పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి.
June 15, 2026 09:18 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్న పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించి అధిక మొత్తాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. సీబీఎస్‌ఈ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తున్నారని విమర్శించారు. ‘మోడల్ స్కూల్’ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.

గ్రామీణ ప్రాంతమైన రామన్నపేటలో అధిక ఫీజుల సంస్కృతిని తీసుకొచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి అనుమతులు ఉండవని, అయినప్పటికీ పదో తరగతి వరకు బోధన ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను తనిఖీ చేసి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా గర్ల్స్‌ కన్వీనర్ ఇందురాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News