పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా
పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా
Biksham
రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు విశేష రుద్రాభిషేకం – భారీగా తరలివచ్చిన భక్తులు
అధిక జ్యేష్ఠ మాసం సోమవారం అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పిల్లలమర్రిలోని రెండు బ్రహ్మసూత్ర శివలింగాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెల్లవారుజామున ఆలయ అర్చకులు పంచామృతాలతో శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి ఈశ్వరుడికి విశేష పుష్పాలంకరణ చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.విశేష అలంకరణలో భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం కలిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి