Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 11:55 AM

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా
June 15, 2026 10:28 AM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు విశేష రుద్రాభిషేకం – భారీగా తరలివచ్చిన భక్తులు


అధిక జ్యేష్ఠ మాసం సోమవారం అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పిల్లలమర్రిలోని రెండు బ్రహ్మసూత్ర శివలింగాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తెల్లవారుజామున ఆలయ అర్చకులు పంచామృతాలతో శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి ఈశ్వరుడికి విశేష పుష్పాలంకరణ చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.విశేష అలంకరణలో భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం కలిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News