Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:11 PM

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా
15-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు విశేష రుద్రాభిషేకం – భారీగా తరలివచ్చిన భక్తులు


అధిక జ్యేష్ఠ మాసం సోమవారం అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పిల్లలమర్రిలోని రెండు బ్రహ్మసూత్ర శివలింగాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తెల్లవారుజామున ఆలయ అర్చకులు పంచామృతాలతో శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి ఈశ్వరుడికి విశేష పుష్పాలంకరణ చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.విశేష అలంకరణలో భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం కలిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Sthanikam

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

Article Image

రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు విశేష రుద్రాభిషేకం – భారీగా తరలివచ్చిన భక్తులు


అధిక జ్యేష్ఠ మాసం సోమవారం అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పిల్లలమర్రిలోని రెండు బ్రహ్మసూత్ర శివలింగాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తెల్లవారుజామున ఆలయ అర్చకులు పంచామృతాలతో శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి ఈశ్వరుడికి విశేష పుష్పాలంకరణ చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.విశేష అలంకరణలో భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం కలిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News