ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు
ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు
Krishna
మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలోని మోమిడి కాలనీలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. కాలనీవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురికి నీరు సక్రమంగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో నాలా తవ్వకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బీరప్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి