Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 08:51 PM

ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు

ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు

ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు
June 15, 2026 07:23 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలోని మోమిడి కాలనీలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. కాలనీవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురికి నీరు సక్రమంగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో నాలా తవ్వకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బీరప్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News