నేరడ–గాదిరెడ్డిపల్లె బ్రిడ్జి కోసం రైతుల గళం 100 మందికిపైగా రైతులతో కలెక్టరేట్కు వినతి
నేరడ–గాదిరెడ్డిపల్లె బ్రిడ్జి కోసం రైతుల గళం 100 మందికిపైగా రైతులతో కలెక్టరేట్కు వినతి
Editor Desk
నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ 100 మందికిపైగా రైతులు, గ్రామస్తులు సోమవారం నల్గొండ కలెక్టరేట్ను ముట్టడించారు. కాసోజు శంకరాచారి నాయకత్వంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి లేక రైతులు పొలాలకు వెళ్లడం, పంటలను మార్కెట్కు తరలించడం కష్టసాధ్యంగా మారిందన్నారు. గర్భిణీలు, రోగులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులు కూడా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
బ్రిడ్జి నిర్మాణం కేవలం అభివృద్ధి పనికాదని, వేలాది మంది ప్రజల జీవనాడిని కలిపే ప్రాజెక్ట్ అని కాసోజు శంకరాచారి అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
రైతుల వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు స్థల పరిశీలన నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ సానుకూల స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి బ్రిడ్జి నిర్మాణం సాధించుకుంటామని రైతులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళా రైతులు, గ్రామ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి