Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 16, 2026 12:08 AM

నేరడ–గాదిరెడ్డిపల్లె బ్రిడ్జి కోసం రైతుల గళం 100 మందికిపైగా రైతులతో కలెక్టరేట్‌కు వినతి

నేరడ–గాదిరెడ్డిపల్లె బ్రిడ్జి కోసం రైతుల గళం 100 మందికిపైగా రైతులతో కలెక్టరేట్‌కు వినతి

నేరడ–గాదిరెడ్డిపల్లె బ్రిడ్జి కోసం రైతుల గళం 100 మందికిపైగా రైతులతో కలెక్టరేట్‌కు వినతి
June 15, 2026 10:20 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ 100 మందికిపైగా రైతులు, గ్రామస్తులు సోమవారం నల్గొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కాసోజు శంకరాచారి నాయకత్వంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి లేక రైతులు పొలాలకు వెళ్లడం, పంటలను మార్కెట్‌కు తరలించడం కష్టసాధ్యంగా మారిందన్నారు. గర్భిణీలు, రోగులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులు కూడా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బ్రిడ్జి నిర్మాణం కేవలం అభివృద్ధి పనికాదని, వేలాది మంది ప్రజల జీవనాడిని కలిపే ప్రాజెక్ట్ అని కాసోజు శంకరాచారి అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

రైతుల వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్థల పరిశీలన నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

కలెక్టర్ సానుకూల స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి బ్రిడ్జి నిర్మాణం సాధించుకుంటామని రైతులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళా రైతులు, గ్రామ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News