Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:31 PM

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి.

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి.

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి.
June 15, 2026 02:30 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్ పదవిని నాయి బ్రాహ్మణ వర్గానికే కేటాయించాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రాచీన కాలం నుంచి క్షవర వృత్తి సమాజానికి విశేష సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయితే ఆధునిక కాలంలో కార్పొరేట్ సెలూన్ల విస్తరణతో సంప్రదాయ క్షవర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం క్షవర వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించడంతో పాటు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు పాలక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 50 సంవత్సరాలు నిండిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్ మంజూరు చేయాలని, దేవాలయ కళ్యాణకట్టల్లో పనిచేస్తున్న క్షురకులను పర్మినెంట్ చేయాలని, పాఠశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, పోలీస్ శాఖల్లో బార్బర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్షవర వృత్తిదారుడికి మెడికల్ కిట్ అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాపర్తి గణేష్, ఉపాధ్యక్షుడు దడిపెల్లి గణేష్, కోశాధికారి వావిళ్ల సంతోష్, వేముల అశోక్, రాసమల్ల శ్రీకాంత్, జంపాల మురళి, మహేష్, వేముల దశరథ, డి.నాగరాజు, జంపాల నరేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News